Wed Apr 24 2024 01:25:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పీకల్లోతు కష్టాల్లో పాక్
పాక్ ఇబ్బందుల్లో పడింది. ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్, భారత్ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. 110 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాక్ తర్వాత షోయబ్ మాలిక్, బాబర్ అజాం నిలదొక్కుకోవడంతో కొంత స్కోరును పెంచగలిగింది. బాబర్ అజామ్ అవుట్ అయిన తర్వాత వరుసగా పాక్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు, కులదీప్ యాదవ్ కు ఒకటి, కేదార్ జాదవ్ కు రెండు వికెట్లు తీసుకుని పాక్ బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించారు. షోయబ్ మాలిక్ ను అంబటి రాయుడు రన్ అవుట్ చేశారు. మొత్తం మీద దాయాది పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
Next Story