Fri Apr 19 2024 11:48:35 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు మద్దతుగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర నేడు 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వెంకటాపురం గ్రామంలో ఆయన ఈ మైలురాయిని చేరుకోనున్నారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటుచేసిన పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు. కాగా, అధినేత పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మల్యేలు, సమన్వయకర్తలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జగన్ పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు చేరడం, అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Next Story