Sat Apr 20 2024 11:28:14 GMT+0000 (Coordinated Universal Time)
జానారెడ్డికి జైపాల్ రెడ్డి సలహా
సీఎల్పీ నేత కె.జానారెడ్డికి మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఓ సలహా ఇచ్చారు. మెత్తగా మాట్లాడితే... అందరూ బలహీనతగా తీసుకుంటారని, కాబట్టి అప్పుడప్పుడు దూకుడుగా ఉండాలని సూచించారు. బుధవారం జానారెడ్డి ‘అజాత శత్రువు’ పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... జానారెడ్డి వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేత తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరూ లేరన్నారు. ఆయన పుస్తకాల్లో ఉన్న అంశాలను తెలుసుకోవడంతో పాటు నిపుణులను మాట్లాడి అవగాహన పెంచుకుంటారని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆజాత శత్రువుగా ఉండటమే కాకుండా అప్పుడప్పుడూ దూకుడుగా కూడా ఉండాలని జానారెడ్డికి హితవు పలికారు.
Next Story