Sun May 05 2024 17:07:51 GMT+0000 (Coordinated Universal Time)
డీజీపీ అలా మాట్లాడమేంటి?
తిరుపతి ఉప ఎన్నికల ప్రశాంతంగా జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పడంపై మాజీ మంత్రి జవహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు [more]
తిరుపతి ఉప ఎన్నికల ప్రశాంతంగా జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పడంపై మాజీ మంత్రి జవహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు [more]
తిరుపతి ఉప ఎన్నికల ప్రశాంతంగా జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పడంపై మాజీ మంత్రి జవహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పోలవ్వడం డీజీపీకి కన్పించలేదా? అని జవహర్ ప్రశ్నించారు. 250 బస్సులను వెనక్కు పంపామని డీజీపీయే స్వయంగా ఒప్పుకున్నారని, తనను తాను డీజీపీ మోసం చేసుకుని అధికార పార్టీకి అండగా నిలబడ్డారని జవహర్ అభిప్రాయపడ్డారు. దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడమేంటని జవహర్ నిలదీశారు.
Next Story