జగన్ వన్నీ తాతబుద్ధులే...!
జగన్ కు అన్నీ వాళ్ల తాతబుద్ధులే వచ్చాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మహానాడులో జేసీ మాట్లాడుతూ జగన్ తో రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ అనుభవమన్నారు. జగన్ గత ఎన్నికలకు ముందు తన వద్దకు విజయసాయి రెడ్డిని పంపారని, పార్టీలో చేరాలని, ఎంత ఖర్చు పెడతావో చెప్పాలని తనను అడిగారన్నారు. కాని తాను కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, జగన్ దగ్గర ఊడిగం చేయలేకే వెళ్లలేదని చెప్పారు. వైఎస్ కూడా తనతో అనేకసార్లు జగన్ గురించి చెప్పేవారని, జగన్ తో వేగడం కష్టమనే వారని జేసీ చెప్పారు.
మోడీ నుంచి రూ.1500 కోట్లు.....
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినైనా జగన్ ను ఎందుకు వ్యతిరేకించానంటే అతని పోకడలు ఇష్టపడకనేనని జేసీ చెప్పారు. జేసీ ప్రసంగాన్ని చంద్రబాబు ఆసక్తిగా వినడం కన్పించింది. జేసీ తన ప్రసంగంలో జగన్ తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ విషయాలను కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల కోసం జగన్ ప్రధాని మోడీ నుంచి పదిహేను వందల కోట్లు తెచ్చుకుంటున్నారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో జేసీ ప్రసంగం అంతా జగన్ ను టార్గెట్ గా చేసుకునే సాగడం విశేషం. చంద్రబాబు వల్లనే బీజేపీకి గత ఎన్నికల్లో రెండు ఎంపీ సీట్లయినా వచ్చాయన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- communist parties
- indian national congress
- J.C.Divakar reddy
- janasena party
- k chandrasekhar rao
- mahanadu
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telangana rashtra samithi
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- జేసీ దివాకర్ రెడ్డి
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- మహానాడు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ