Sat Apr 20 2024 15:03:48 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచానికే పాఠాలు చెప్పాం
ఐక్యరాజ్యసమితిలో తొలిసారి ప్రపంచానికి పాఠం చెప్పే స్థాయికి ఎదిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతుందన్నారు. టెక్నాలజీ, ప్రకృతిని అనుసంధానించి అద్భుతాలు సృష్టించవచ్చని బాబు అభిప్రాయపడ్డారు. 2054 నాటికి 60 లక్షల మంది రైతులతో రెండు కోట్ల ఎకరాలతో ప్రకృతి వ్యవసాయం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. అమెరికా పర్యటనలో అనేక ఒప్పందాలను చేసుకున్నామన్నారు.
Next Story