Sat Apr 20 2024 04:13:40 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యం కల్గించలేదు
కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ప్రకటన తనకు ఆశ్చర్యం కల్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరడానికి వైసీపీ తహతహలాడుతుందన్నారు. వైసీపీ లోపల విశ్వాసం, బయట అవిశ్వాసంగా బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటికి పవన్ వంత పాడుతున్నారని అన్నారు. కేసుల విషయంలోనే వైసీపీ బీజేపీతో లాలూచీ పడిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన పార్టీని జనం ఆదరించలేదని, అందుకే ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- kiran kumar reddy
- nara chandrababu naidu
- pavan kalyan
- polavaram
- ramdas adhavale
- telugudesam party
- y.s.jagan mohan reddy
- ysr congress. y.s. jaganmohan reddy
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కిరణ్ కుమార్ రెడ్డి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పోలవరం
- భారతీయ జనతా పార్టీ
- రాందాస్ అధవాలే
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story