Wed Apr 24 2024 08:26:27 GMT+0000 (Coordinated Universal Time)
అమ్రాపాలికి కొత్త బాధ్యతలు
ఐఏఎస్ అధికారిని అమ్రాపాలి కాటను రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సీఈఓగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆమె ఇటీవల జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలకు సమయంలో ఎక్కువగా లేకపోవడం, ఏర్పాట్లను వేగవంతం చేయడం కోసం మరో ఐఏఎస్ అధికారి అవసరమనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం అమ్రాపాలికి ఈ బాధ్యతలు అప్పగించింది.
Next Story