Sat Apr 27 2024 02:54:58 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవి మాతోనే ఉన్నారు...!!
మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీ అయినా చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ముగిసినా రెన్యువల్ చేయించుకోలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉంటారని, వచ్చే ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తారని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. జగన్ పై దాడి ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. మహాకూటమి తెలంగాణకే పరిమితం అని, ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్తుందన్నారు. అయితే, పొత్తుల అంశం ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
Next Story