రాహుల్ కొకైన్ తీసుకుంటారా..?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారని, డోప్ టెస్ట్ చేస్తే ఈ విషయం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ లో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి డోప్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టీవీ చానల్ చర్చలో మాట్లాడుతున్న సుబ్రమణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో డ్రగ్స్ ను నియంత్రిస్తామనే ప్రధాన హామీతో బరిలో దిగిన కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ సరఫరా చేసేవారికి మరణ శిక్ష విధించాలని కూడా పంజాబ్ ప్రభుత్వం భావిస్తోంది.