Fri Apr 26 2024 01:28:24 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ నమ్మించి మోసం చేశారు
కేసీఆర్ తనకు టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ ఆరోపించారు. ఆయన శుక్రవారం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానని, తమ జాతి 47 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలదని స్పష్టం చేశారు. తమ జాతి అంతోఇంతో బాగుపడింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు.
Next Story