Fri Mar 29 2024 11:26:22 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీరాముడు కూడా డబ్బు పెట్టాల్సిందే..!
ప్రస్తుతం ఎన్నికలు డబ్బుతో ముడిపడిపోయాయని, శ్రీరాముడు పోటీ చేసినా డబ్బు ఖర్చు పెట్టనిదే గెలవలేని పరిస్థితి ఏర్పడిందని గోవా అరెస్సెస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా రాజధాని పనాజీలో జరిగిన గోవా సురక్ష మంచ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో సుభాష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నందున యువత, మహిళలలను ఆకట్టుకునే పనిలో ఉంటారని, డబ్బులు, బహుమతులు ఇస్తుంటారన్నారు. గతంలో అనారోగ్యం కారణాన్ని చూపి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఇద్దరు మంత్రులను తప్పించారని, మరి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి ఎందుకు తప్పుకోవడం లేదని ప్రశ్నించారు.
Next Story