Fri Apr 26 2024 19:06:27 GMT+0000 (Coordinated Universal Time)
వై.ఎస్. జగన్ ను కలిసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి కలిశారు. ఇవాళ విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న జగన్ పాదయాత్ర ప్రాంతానికి వెళ్లిన ఆమె జగన్ ను కలిసి పలు ఆధ్యాత్మికపరమైన అంశాలను చర్చించారు. టీటీడీలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని, టీటీడీ పేరును ధార్మిక సేవా పరిషత్ గా మార్చాలని ఆమె జగన్ ను కోరారు. టీటీడీకి 25 కిలోమీటర్ల పరిధిలో మధ్యం అమ్మకాలు ఆపేయాలని ఆమె జగన్ కు విజ్ఞప్తి చేశారు.
Next Story