Thu Apr 25 2024 11:43:19 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వ్యాఖ్యలను సమర్థించిన టీడీపీ ఎమ్మెల్యే
కాపులకు రిజర్వేషన్ల విషయం అమలుకానీ, తన చేతిలో లేని హామీలను ఇవ్వలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సమర్థించారు. కేంద్రం పరిధిలోని అంశంపై హామీ ఇచ్చి ఎందుకు ఇబ్బందిపడాలని జగన్ అనడం సరైందేనని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే ఒక వాస్తవికవాదిగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.
Next Story