Thu Apr 25 2024 17:09:47 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కుంపటి
తెలంగాణ కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి ముదురుతోంది. టిక్కెట్లు దక్కని నేతలంతా ఒక్కటవుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన టిక్కెట్లు దక్కని నేతలు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వీరి ఫ్రంట్ కు ‘కాంగ్రెస్ రెబెల్స్ ఫ్రంట్’ అని పేరు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 20 - 30 మంది ఈ ఫ్రంట్ కింద కామన్ సింబల్ పై పోటీ చేయనున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి బోడ జనార్ధన్ ఇప్పటికే ప్రకటించారు.
Next Story