Sun May 05 2024 17:17:21 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : టీడీపీ నేతల వాహనం బోల్తా..లోకేష్ పర్యటనకు వస్తుండటంతో?
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుత్తి హైవేలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను [more]
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుత్తి హైవేలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను [more]
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుత్తి హైవేలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఒకరి పరిస్థిితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
గుత్తి హైవే పై…?
ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నేతలు అనంతపురం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి హైవే పై వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story