Fri Apr 19 2024 16:49:25 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ ని ఓడిస్తామని సీమ నేత వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడిస్తామని టీడీపీ రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేశ్ వార్మింగ్ ఇచ్చారు. తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు సుమారు 25 శాతం మంది ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీకి హోదా సాధించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతివ్వాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలకు పిలుపునిస్తామని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లుగానే తెలంగాణలో టీఆర్ఎస్ ని ఓడిస్తామన్నారు.
Next Story