Fri Apr 26 2024 21:46:52 GMT+0000 (Coordinated Universal Time)
బరాబర్ అది ఆయనే....!
అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బరాబర్ బట్టేబాజేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. జాతీయ నేతల జయంతి నాడు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించే తీరిక కూడా కేసీఆర్ కు లేదని పేర్కొన్నారు. తాను దేశ రక్షణ కోసం ఆర్మీలో పనిచేస్తుంటే కేసీఆర్ పాస్ పోర్టుల బ్రోకర్ గా పనిచేశారని ఆరోపించారు. ఓసారి ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేసీఆర్ అరెస్ట్ అయితే కాంగ్రెస్ నేత ఎం.సత్యానారాయణరావు విడిపించారని గుర్తు చేశారు.
Next Story