Thu Mar 28 2024 11:22:01 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ ఓటుకు నోటు కేసు....?
ఓటుకు నోటు కేసు విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. ఆయన ప్రగతి భవన్ లో కొద్దిసేపటి క్రితం ఈ కేసు పురోగతిపై పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదికపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లూ ఈ కేసు విషయంలో మౌనంగా ఉన్న కేసీఆర్ హటాత్తుగా సమీక్ష జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిన్న గవర్నర్ నరసింహన్ తో కూడా ఈ విషయంపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ మళ్లీ ఓటుకు నోటు కేసును ఎన్నికల వేళ బయటకు తెస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
- Tags
- andhra pradesh
- chief minister
- indian national congress
- k.chanrdasekhara rao
- nara chandrababu naidu
- revanth reddy
- review
- telangana
- telangana rashtra samithi
- telugudesam party
- vote for note
- ఆంద్రప్రదేశ్
- ఓటుకు నోటు కేసు
- కె. చంద్రశేఖర్ రావు
- తెలంగాణ
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- ముఖ్యమంత్రి
- రేవంత్ రెడ్డి
- సమీక్ష
Next Story