జగన్..పవన్ పిలుపిస్తే..?
జగన్ పై జనసేన ఫైరయ్యింది. సంకుచిత ధోరణితో మాట్లాడే ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరమని జనసేన పార్టీ నేత మాదాసు గంగాధరం అన్నారు. జగన్ పవన్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన సీరియస్ అయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న విషయాన్ని మాదాసు గంగాధరం గుర్తు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని పవన్ తమకు సంస్కారం నేర్పించారన్నారు.
పవన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?
పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు. ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీకి హాజరుకాకపోవడాన్ని పవన్ ప్రశ్నించారన్నారు. పవన్ ఒక పిలుపు నిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మాదాసు గంగాధరం జగన్ ను హెచ్చరించారు. పవన్ తనకు అధికారమే పరమావధి కాదని పదే పదే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పవన్ లాంటి మంచి వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడతావా? అని జగన్ పై ఫైరయ్యారు మాదాసు గంగాధరం.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- madasu gangadharam
- nara chandrababu naidu
- pavan kalyan
- prajasankalpa padayathra
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- మాదాసు గంగాధరం
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ