Fri Apr 19 2024 06:58:03 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఒక ఫేక్ పార్టీ
వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీపై ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. నాలుగేళ్లలో టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ రాజకీయమే ఫేక్ అని చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు. తాను 20వ తేదీన దీక్షను చేపడుతున్నానని, అదేరోజు 175 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేపట్టి ప్రత్యేక హోదా నినాదాన్ని పతాక స్థాయికి చే్ర్చాలన్నారు.
Next Story