Tue Apr 23 2024 20:30:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల దీక్షకు ప్రభుత్వం అనుమతి
ఏపీ భవన్ లో దీక్షకు ప్రభుత్వ అనుమతిచ్చింది. రేపు పార్లమెంటు సమావేశాలు చివరిరోజు కావడంతో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు. వెనువెంటనే ఏపీ భవన్ కు వెళ్లి ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో తమ దీక్షకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ను ఎంపీలు రెండు రోజుల క్రితంకోరారు. వైసీపీ ఎంపీల దీక్షలను ఏపీ భవన్ లో చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
Next Story