Fri Mar 29 2024 09:42:38 GMT+0000 (Coordinated Universal Time)
మరో అడుగు ముందుకేసిన వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న ఆయన ఇవాళ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. పాదయాత్రలో ఇప్పటికే 11 జిల్లాలు పూర్తి చేసుకున్న జగన్ 12వ జిల్లా అయిన విజయనగరంలోకి అడుగుపెట్టారు. ఎస్.కోట నియోజకవర్గంలోని చింతలపాలెం గ్రామంలో ఆయనకు విజయనగరం జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు జగన్ సమక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Next Story