Thu Apr 25 2024 01:38:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీ ఎంపీలకు మళ్లీ పిలుపు
ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలను మళ్లీ ఢిల్లీకి రావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహజన్ సూచించారు. గత పార్లమెంటు సమావేశాల చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. అయితే, వాటిపై మాట్లాడేందుకు స్పీకర్ ఆహ్వానించగా నాలుగు రోజుల క్రితం ఎంపీలు ఢిల్లీ వెళ్లి స్పీకర్ ని కలిశారు. ఈ సందర్భంగా రాజీనామాలను ఆమోదించాలని వారు గట్టిగా కోరారు. అయితే, స్పీకర్ మాత్రం ఇందుకు వారం రోజులు సమయం ఇచ్చారు. అయితే, ఈ నెల 5 లేదా 6వ తేదీన మళ్లీ ఢిల్లీ రావాలని స్పీకర్ సూచించారు. ఆమె వీరి నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చివరగా మరోసారి అడిగే అవకాశం ఉంది. రాజీనామాలకే కట్టుబడి ఉంటే ఆమోదించే అవకాశముంది.
Next Story