Sat May 04 2024 07:56:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వెస్ట్గోదావరికి జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని కలగంపూడిలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమార్తె వివాహ వేడుకకు ఆయన హాజరు కానున్నారు.
వివాహ వేడుకకు...
సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుటారు. అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరిగి 5.55 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
Next Story