Wed May 08 2024 20:24:15 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో కొనసాగుతున్న చేరికలు
వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో చేరికలు కొనసాగుతున్నాయి
వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో చేరికలు కొనసాగుతున్నాయి. చీకటిమనిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కొందరు నేతలు పార్టీలో చేరారు. వారిని సాదరంగా జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజంపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి, మదనపల్లె టీడీపీ మైనారిటీ సెల్ నేత మొబసిర్ అహ్మద్, కదిరి నియోజకవర్గం నేత గంగాధర్ తో పాటు పలువురు నేతలు వైసీపీలో చేరారు.
సాదరంగా ఆహ్వానించి...
వారికి కండువాలు కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తిరిగి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ చెప్పారు.
Next Story