Thu May 02 2024 21:28:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టెక్కలి అభ్యర్థిని ప్రకటించిన జగన్
ముఖ్యమంత్రి జగన్ టెక్కలి అభ్యర్థిని ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ను వచ్చే ఎన్నికల్లో బరిలో దింపనున్నట్లు ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ టెక్కలి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపనున్నట్లు ప్రకటించారు. మూలపేటలో జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించారు. శ్రీనును మీ చేతుల్లో పెడుతున్నానని అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. టెక్కలి నియోజకవర్గంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని చెబుతున్నానని అన్నారు.
దువ్వాడ శ్రీనును...
దువ్వాడ శ్రీను కోరినట్లుగానే సంతబొమ్మాళి మండలంలోని గ్రామాలకు తాగునీరు అందించేందుకు 70 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. శ్రీనును టెక్కటి నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించాని కోరడంతో వచ్చే ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ టెక్కలి అభ్యర్థి అని ఆయన చెప్పకనే చెప్పారు.
Next Story