Fri May 03 2024 09:55:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : 15న పల్నాడు జిల్లాకు జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వరికలపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వరికలపూడిసెల ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగన్ మాచర్ల చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
వరికపూడిసెల ప్రాజెక్టుకు...
అక్కడ చెన్నకేశవ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా ఈ సభలో ప్రస్తావించనున్నారు. మరోవైపు విపక్షాలపై కూడా విరుచుకుపడనున్నారు. ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Next Story