Sat Apr 27 2024 19:04:35 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో పెద్దగా భక్తులు రద్దీ లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో పెద్దగా భక్తులు రద్దీ లేదు. గత రెండు మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. దసరా సెలవులు పూర్తి కావడం, వీకెండ్ కాకపోవడంతో భక్తులు అంతగా రాలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 63,710 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులకు దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమలలో 21,205 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story