Sat May 18 2024 19:58:10 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అందుకే కూటమిని ఏర్పాటు చేశాం
ఆంధ్రా లో గుండాగిరి నీ అంతం చేయడానికే కూటమి ఏర్పాటు అయినట్లు హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఆంధ్రా లో గుండాగిరి నీ అంతం చేయడానికే కూటమి ఏర్పాటు అయినట్లు హోంమంత్రి అమిత్ షా అన్నారు. ధర్మవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూఆంధ్రాలో లాండ్ మాఫియా అంతం చేయడానికే కూటమి ఏర్పాటు అయిందన్నారు.ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ప్రభుత్వం అంత చేయడానికే కూటమి ఏర్పాటు చేశామన్నారు. అమరావతిలో రాజధానిని కొనసాగిస్తామని అమిత్ షా చెప్పారు.
జగన్ అప్పలు చేసి...
తిరుమల పవిత్రతను కాపాడుతామని, అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగిందన్న అమిత్ షా జగన్ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. 13 లక్షల 50 వేల కోట్ల అప్పును ఏపీపై జగన్ రుద్దారన్నారు. మద్యనిషేధం హామీ ఇచ్చి.. మద్యం సిండికేట్ను జగన్ ప్రోత్సహించారని అమిత్షా అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.
Next Story