Sun May 19 2024 02:41:02 GMT+0000 (Coordinated Universal Time)
అందరూ ఇరుక్కుంటారు... జేసీ
ఈడీ అధికారులు తనకు వాహనాలు ఇచ్చిన అశోక్ లేలాండ్ యాజమాన్యాన్ని విచారించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనతో పాటు తనకు వాహనాలు ఇచ్చిన అశోక్ లేలాండ్ యాజమాన్యాన్ని విచారించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన తాడిపత్రిలో మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణ చేయడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. తనకు వాహనాలను అమ్మిన అశోక్ లేలాండ్ యాజమాన్యాన్ని ఈడీ విచారించలేదని తెలిపారు. నాగాలాండ్ అధికారులను కూడా విచారణ చేయలేదని ఆయన అన్నారు.
ఈడీ నాకు దేవుడు...
తాము 38 కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్లు ఆరోపిస్తున్నారని, వాస్తవాలన్నీ తర్వాత వెలుగులోకి వస్తాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ కేసులో ఆర్టీవో తా పాటు పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారని ఆయన అన్నారు. తమకు వాహనాలను అమ్మిన ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ ను విచారించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story