Tue Apr 30 2024 23:16:13 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే
కోడికత్తి కేసులో న్యాయస్థానంలో హాజరుకావాలని ముఖ్యమంత్రి జగన్ కు ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోడికత్తి కేసులో న్యాయస్థానంలో హాజరుకావాలని ముఖ్యమంత్రి జగన్ కు ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న జరగనున్న విచారణకు హాజరుకావాలని కోరింది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నేడు విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసుపై విచారణ జరిగింది.
పీఏ కూడా...
ఈ సందర్భంగా న్యాయమూర్తి బాధితులు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తోపాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Next Story