Fri May 03 2024 01:32:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కూడా పాణ్యంలోనే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 89వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 89వ రోజుకు చేరుకుంది. పాణ్యం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకూ 1135,6 కిలోమీటర్ల మేర లోకేష్ పాదాయత్ర చేశారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు పాదయాత్ర ప్రారంభమయింది. 7.05 గంటలకు రేమండూరులో వాల్మీకి బోయలతో సమావేశమయ్యారు. 8గంటలకు పుసులూరులో ఎస్సీలతో లోకేష్ సమావేశమై వారి సమస్యలపై చర్చించారు.
యువగళం ఇలా...
అనంతరం 8.55 గంటలకు బొల్లవరం గ్రామస్తులతో భేటీ అయ్యారు. 9.35 గంటలకు గొల్లవరంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు.. 10.35 గంటలకు గొల్లవరంలో భోజన విరామానికి లోకేష్ ఆగుతారు. సాయంత్రం 4గంటలకు గొల్లవరం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. సాయంత్రం 4.30 గంటలకు బస్తిపాడు వంతెన వద్ద గ్రామస్తులతో సమావేశమవుతారు. 5.25 గంటలకు చిన్నకొట్టాల వద్ద గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. రాత్రికి పెద్ద కొట్టాలలో లోకేష్ బస చేయనున్నారు.
Next Story