Fri May 17 2024 04:29:00 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : రష్ ఫుల్... హుండీ ఆదాయం అంతంత మాత్రమే
తిరుమలలో నేడు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. గురువారమయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో నేడు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు వెలువడటంతో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువయింది.పరీక్షల్లో పాసయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు చేరుకోవడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పన్నెండు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,510 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరలో 30,441 మంది భక్తులు తలనీలాలలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.62 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story