Fri May 03 2024 14:15:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 377 నిబంధన కింద లోక్ సభలో లిఖితపూర్వకంగా కూడా రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా మారిందని, అప్పులు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.
ఆర్థికంగా దివాలా....
కనీసం ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని రఘురామ కృష్ణరాజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కార్పొరేషన్ లను ఏర్పాటు చేసి దొడ్డిదారిన రుణాలను తెచ్చి సర్దుతున్నారన్నారు. ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.
Next Story