Sun May 05 2024 18:37:59 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ లో హాష్ ఆయిల్ ముఠా అరెస్ట్
అలాగే మేడ్చల్ పీఎస్ పరిధిలో దూలపల్లిలో శుక్రవారం ఉదయం ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 14.5 కిలోల గంజాయిని..
బోయినపల్లి : తెలంగాణలో మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ బోయినపల్లిలో హాష్ ఆయిల్ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారివద్ద నుంచి 315 గ్రాముల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే మేడ్చల్ పీఎస్ పరిధిలో దూలపల్లిలో శుక్రవారం ఉదయం ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. వలస కార్మికులు, విద్యార్థులు టార్గెట్ గా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Next Story