Fri May 03 2024 00:06:33 GMT+0000 (Coordinated Universal Time)
విజయనగరం జిల్లాలో దారుణం...ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం
విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థునులపై అత్యాచారం జరిగింది.
విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థునులపై అత్యాచారం జరిగింది. పోలీసుల పేరుతో ఇద్దరు విద్యార్థినులపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. కురుపాంలోని జియమ్మ వలస మండలంలో పోలీసుల పేరుతో ఈ దారుణానికి దుండగులు ఒడిగట్టారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం విద్యార్థినులు రావాడ ద్యాం వద్దకు వెళ్లారు. అక్కడ వారిని అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల అదుపులో.....
బాధిత విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే అత్యాచారానికి పాల్పడిని ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ యువకుడితో పాటు ఇంకెవరు ఉన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story