శృతిమించితే అంతేసంగతులు
రాజకీయ నాయకులు పరిధులు దాటి చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనించడం లేదని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు ప్రజల మద్దతును మరింతగా సంపాయించాలంటే.. నోటికి [more]
రాజకీయ నాయకులు పరిధులు దాటి చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనించడం లేదని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు ప్రజల మద్దతును మరింతగా సంపాయించాలంటే.. నోటికి [more]
రాజకీయ నాయకులు పరిధులు దాటి చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనించడం లేదని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు ప్రజల మద్దతును మరింతగా సంపాయించాలంటే.. నోటికి పనిచెప్పడం కాకుండా చేతల ద్వారా నిరూపించుకుంటేనే భవిత ఉంటుందనేది గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలోనే రుజువైంది. ఏం చేయాలో.. ఏం చేయకూడదో కూడా గత ఏడాది ఎన్నికలు ఏపీ రాజకీయ నేతలకు గుణపాఠాలు నేర్పాయి. మరి ఇప్పుడు ఆ పాఠాలను వైసీపీ నాయకులు మరిచిపోయినట్టుగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా గీత దాటుతున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
మంత్రుల కామెంట్స్ తో….
మంత్రి కొడాలి నాని .. నీయమ్మా మొగుడు-అంటూ చేసిన కామెంట్లు. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నా యి. ఇప్పుడు తాజా మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే తరహా కామెంట్లకు తెరదీశారు. కేసీఆర్ అన్నట్టు ఉమా అంటే ఆడో, మగో తేడా తెలియదు. ఆయన సీఎంపైన, నాపైన విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటు. నన్ను ఉత్తర కుమారుడని ఉమ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఉత్తర కుమా రుడు లోకేశ్ అన్న సంగతి అందరికీ తెలుసు. రాజకుమారుడు మందబుద్ధి, భయంతో పాటు రేలంగి లాగా సైజులున్న వ్యక్తి లోకేశే.. అని మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలు.., వైరల్ అవుతున్నాయి. ఇవి ఆయనకు ప్లస్ కన్నా కూడా మైనస్గా మారుతున్నాయన్న విషయాన్ని గ్రహించాలి.
ఇప్పటికి బాగానే ఉన్నా….
ఇక, మరో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ (తెనాలి) ఏకంగా చంద్రబాబుపై బూతుల పంచాంగం విప్పారు. మాజీ సీఎం చంద్రబాబు ఒక వెధవన్నర వెధవ. ముసలి ముండా కొడుకు.. మాజీమంత్రి ఆలపాటి కబ్జాకోరు. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకం చేస్తున్నానంటున్నారు. పోలీసులను పక్కనపెట్టి నేనే వస్తా. ఏ సెంటర్కి రమ్మంటావో చెప్పు. నిజంగా నీకు దమ్ముంటే రా. చూసుకుందాం’’ అని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకు మార్ చేసిన వ్యాఖ్యలు అందరూ తప్పుపట్టాల్సిందే. కానీ, ఇప్పటికి ఇవి బాగానే ఉన్నా.. ఓ వర్గం ప్రజలకు ఈ నాయకులు దూరమవుతున్నారన్న విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు పరిశీలకులు. గతంలో టీడీపీ నాయకులు కూడా ఇలానే రెచ్చిపోయి ప్రజలతో ఛీకొట్టించుకున్న విషయాన్ని గమనించాలని చెబుతున్నారు.
గతంలో బాబు కూడా…
టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎలా ఉన్నా ఆయన, ఆయన మంత్రులు మాత్రం వైసీపీ నేతలను టార్గెట్గా చేసుకుని ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. చంద్రబాబు కూడా మౌనంగా చూస్తూ తమ పార్టీ నేతలను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. చివరకు అవన్నీ పార్టీకి మైనస్గా మారి ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణమయ్యాయి. ఇక ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే రూట్లో వెళుతున్నారు. జగన్ వీరిని కంట్రోల్ చేస్తాడా ? లేదా ? బాబులా చేతులు ఎత్తేస్తాడా ? అన్నది చూడాలి.