మాజీ తమ్ముళ్ళకు డోర్స్ క్లోజేనా ?
అదేంటో కాలం కలసిరాకపోతే రాజకీయాలో ఎక్కే నిచ్చెనలు కూడా పాములై పడదోస్తూంటాయి. ఒకపుడు దర్జాగా బతికిన టీడీపీ తమ్ముళ్ళు అధికారం పోయి పొరుగు పార్టీ బీజేపీ పంచన [more]
అదేంటో కాలం కలసిరాకపోతే రాజకీయాలో ఎక్కే నిచ్చెనలు కూడా పాములై పడదోస్తూంటాయి. ఒకపుడు దర్జాగా బతికిన టీడీపీ తమ్ముళ్ళు అధికారం పోయి పొరుగు పార్టీ బీజేపీ పంచన [more]
అదేంటో కాలం కలసిరాకపోతే రాజకీయాలో ఎక్కే నిచ్చెనలు కూడా పాములై పడదోస్తూంటాయి. ఒకపుడు దర్జాగా బతికిన టీడీపీ తమ్ముళ్ళు అధికారం పోయి పొరుగు పార్టీ బీజేపీ పంచన చేరినా దశ మారలేదు సరికదా దిశ కూడా ఎక్కడా సరిగ్గా కనిపించడం లేదుట. బీజేపీకి సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా వచ్చిన తరువాత పెద్ద కత్తెర పట్టుకుని తోకలు కత్తిరించేస్తున్నారు. దాంతో ఎవరికి వారు గప్ చుప్ అవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఒకాయన ఆ మధ్యకాలమంతా తెగ హల్ చేసేవారు. ఇపుడు మీడియా ముందుకు వస్తే ఒట్టు.
ఏమయ్యారో మరి…..
ఇక కేంద్రంలో మంత్రులుగా వెలగబెట్టి బీజేపీ కండుగా కప్పుకున్న వారు ఇపుడు కళా విహీనం అయ్యారు. వారికి జాతీయ స్థాయిలో పలుకుబడిలేదు, ఏపీలో పదవులు లేవు, వారి రాజకీయ జీవితం ఉల్టా సీదా అయిపోయింది. ఏపీలో బీజేపీ చూస్తే అసలు పట్టించుకోకూడదు అని డిసైడ్ అయినట్లుగా ఉంది. దాంతో కనీసం పార్టీ పదవుల్లో అయినా కుదురుకుందామనుకుంటే అది కూడా సాధ్యపడేలా లేదు అంటున్నారు. దాంతో వారిలో ఎక్కడలేని నీరసం, నైరాశ్యం వచ్చేస్తోందిట.
దానికే గురి పెట్టి…
ఇక ఏపీలో కొంతమంది నాయకులు ఉన్నారు. వారంతా ఈ మధ్య దాకా తామే బీజేపీ అన్నట్లుగా తెగ ఫోకస్ అయ్యారు. వారు ఏకంగా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పదవికే గురి పెట్టేసారు. ఆ పదవి చేతిలో ఉంటే చాలు జగన్ని ముప్పతిప్పలు పెట్టవచ్చు, ఎటూ ఢిల్లీలో బీజేపీ పవర్లో ఉంది కాబట్టి కధ నడిపేయవచ్చు అని కాస్తా అతిగానే ఊహించుకున్నారుట. కానీ ఒక్కసారిగా కన్నా పోయి సోము వచ్చేసరికి అంతా రాం రాం రాం అయిందట. ఇక కనీసం పార్టీలో ఏవైన కీలకమైన పదవులు అయినా ఇస్తారనుకుంటే అసలు వారు పార్టీలో ఉన్నారా అన్న డౌట్ వారికే పుట్టేలా ఫక్త్ బీజేపీ నేతలతో సోము వీర్రాజు కమిటీని కూర్పు చేసి వదిలారు.
కంచి గరుడ సేవేనా …?
బీజేపీలో చేరిన తరువాత తమ మునుపటి చిరునామా కూడా గల్లంతయ్యేలా ఉందని కూడా ఫిరాయింపు నేతలు అనుకుంటున్నారుట. ఇక ఏపీలో బీజేపీ అజెండా కూడా వేరుగా ఉంది. ఆ పార్టీలో చేరిన తమ్ముళ్ళకు ఇది ఇబ్బందీగా ఉంది. తొలి ప్రాధాన్యత టీడీపీకి ఇచ్చి సోము వీర్రాజు ఆ పార్టీని టార్గెట్ చేశారు. దాంతో ఇపుడు తమకు తాముగా ఈ నేతలంతా వెనక్కి తగ్గాల్సివస్తోందిట. మొత్తం మీద బీజేపీని ఎంతవరకూ ముందుకు తీసుకెళ్తారో తెలియదు కానీ బీజేపీలో కొత్త వారికి, అప్పటికపుడు కండువా కప్పేసి కాషాయం కట్టేసిన వారికి మొదటి పంక్తిలో కూర్చునే చాన్స్ లేదని మాత్రం చెప్పేశారు.