టిట్ ఫర్ టాట్ అట
అందరూ కోరుకుని ఫిరాయింపుల చట్టం తీసుకురాలేదు. దాని వెనకాల ఒక కధ ఉంది. అప్పట్లో రాజీవ్ గాంధీకి ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత బండ మెజారిటీ వచ్చేసింది. [more]
అందరూ కోరుకుని ఫిరాయింపుల చట్టం తీసుకురాలేదు. దాని వెనకాల ఒక కధ ఉంది. అప్పట్లో రాజీవ్ గాంధీకి ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత బండ మెజారిటీ వచ్చేసింది. [more]
అందరూ కోరుకుని ఫిరాయింపుల చట్టం తీసుకురాలేదు. దాని వెనకాల ఒక కధ ఉంది. అప్పట్లో రాజీవ్ గాంధీకి ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత బండ మెజారిటీ వచ్చేసింది. 400 పైగా ఎంపీలు కాంగ్రెస్ తరఫున గెలిచారు. దాంతో ముందు జాగ్రత్తగా రాజీవ్ గాంధీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. ఎవరు గోడ దూకినా వేటు పడుతుందని కూడా పేర్కొన్నారు. అయితే ఆ చట్టంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ వరకూ ఒకేగా సాగిన ఈ కధ తరువాత అడ్డం తిరిగింది. దాంతో మరిన్ని సవరణలు తెచ్చారు. ఎన్ని తెచ్చినా కూడా ఎక్కడో ఒక చోట రంద్రాలు ఉన్నాయి. వాటిని అన్వేషించే వారూ ఉన్నారు. వీటన్నిటికీ మూల బిందువుగా స్పీకర్ ఉన్నారు. ఆయన విచక్షణ మీద ఫిరాయింపుల కేసులు ఆధారపడి సాగుతాయి. ఇక ఏపీలో చూసుకుంటే ఫిరాయింపులు వద్దే వద్దు అని జగన్ అంటున్నారు. ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకి తాళాలు ఇచ్చేశారు.
బీజేపీ బిక్కచూపులు….
ఏపీలో బీజేపీ బలం పెరగాలంటే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవాలి. తీసుకుంటే వేటు వేయడానికి వైసీపీ స్పీకర్ సిధ్ధంగా ఉన్నారు. దాంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు ముందుకూ వెనక్కు జరుగుతున్నారు. మరో వైపు ఏపీలో బలంగా ఉన్న వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టెసింది. బీజేపీలోకి నేతలు వెళ్లకుండా తానే కండువా కప్పేస్తున్నారు జగన్. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బీజేపీలోకి కాకుండా జగన్ వైపునకు ఇలాగే వచ్చేసారు. అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకుని రాజీనామా చేయించి అయినా తన వైపు తిప్పుకోవాలని వైసీపీ చూస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీకి ఆకలి చూపులు తప్ప ఆశ తీరడం లేదు. మరి మండిపోతోంది కమలనాధులకు. అందుకే జగన్ మీద గరం గరం అవుతున్నారట.
ఎంపీలను లాగేస్తారట…..
అవును మరి కేంద్రంలో బీజేపీ ఉంది. వారికి అక్కడ స్పీకర్ ఉన్నారు. అందువల్ల ఫిరాయింపుల కేసు అక్కడ స్పీకర్ పరిధిలోకి వచ్చినా కమలనాధులు చెప్పినట్లుగానే సాఫీగా వ్యవహారం సాగిపోతుంది. ఓ విధంగా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా మీరు ఏపీలో మాకు ఆకలి తీర్చకపోతే మేము మీ ఎంపీలను లాగేస్తామని బీజేపీ దాదాపుగా హెచ్చరిస్తున్నట్లుగానే చెబుతున్నట్లుగా ఉంది. బీజేపీ సీనియర్ నేత సోము వీర్ర్రాజు ఏ మాత్రం దాచుకోకుండా ఈ సంగతి చెప్పేశారు. మీరే బలపడాలా, మేము బలపడకూడదా, 151 మంది ఎమ్మెల్యేలను మీకిచ్చినా ఇంకా చేర్చుకుంటున్నారు. మరి మేము మాత్రమే కరెక్ట్ గా ఉండాలా అంటూ జగన్ సర్కార్ మీద ఫైర్ అయ్యారు.
టచ్ లోకి వస్తున్నారంటూ….
మీ ఎంపీలు మాకు టచ్ లోకి వస్తున్నారంటూ సోము వీర్రాజు బాంబు పేల్చారు. నిన్నటికి నిన్న టీడీపీ చీలిపోతుందని చెప్పిన సోము ఇపుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ రెండు ముక్కలు అవుతుందని శాపాలు పెడుతున్నారు. చెప్పాలంటే ఈ అక్కసు అంతా ఏపీలో ఎమ్మెల్యేలకు కందువాలు కప్పకుండా అనర్హత కత్తి పట్టుకుని వైసీపీ స్పీకర్ ఉన్నాడనే. మరి జనంలో బలం ఉంటే జగన్ మాదిరిగానే వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెచ్చి గెలవవచ్చు కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీకి ఊపిరి ఆడకపోతే ఢిల్లీలో చూసుకుంటామని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది మరి.