మునిగిపోతాం..మనకెందుకు.. బాబుకు దూరంగా ఉంటేనే బెటర్
చంద్రబాబు నాయకత్వం మీద, టీడీపీ భవిష్యత్తు మీద నమ్మకం రోజురోజుకూ పోతోంది. ఆ వరసలో సీనియర్ తమ్ముళ్ళు చాలా ముందే ఉన్నారు. ఇపుడు తెలుగుదేశానికి బలమైన సామాజిక [more]
చంద్రబాబు నాయకత్వం మీద, టీడీపీ భవిష్యత్తు మీద నమ్మకం రోజురోజుకూ పోతోంది. ఆ వరసలో సీనియర్ తమ్ముళ్ళు చాలా ముందే ఉన్నారు. ఇపుడు తెలుగుదేశానికి బలమైన సామాజిక [more]
చంద్రబాబు నాయకత్వం మీద, టీడీపీ భవిష్యత్తు మీద నమ్మకం రోజురోజుకూ పోతోంది. ఆ వరసలో సీనియర్ తమ్ముళ్ళు చాలా ముందే ఉన్నారు. ఇపుడు తెలుగుదేశానికి బలమైన సామాజిక మద్దతు, ఆర్ధిక దన్ను ఇచ్చిన కోస్తాలోని ఓ సామాజికవర్గం ఆలోచనలో పడిందని అంటున్నారు. ఆ వర్గానికి టీడీపీ సారధిగా చంద్రబాబు ఉంటే మళ్ళీ జగన్ దే విజయం అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయట. ఇక పెట్టుబడిదారులు కూడా మెల్లగా టోన్ మారుస్తున్నారు. ఇపుడు టీడీపీ పెద్దలు సైతం ఊహించని పరిణామం ఒకటి జరుగుతోంది. అదేంటి అంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ వచ్చిన బలమైన మీడియాలో ఓ వర్గం దూరం జరుగుతోంది. ఇంతకాలం చంద్రబాబుని మోసి తామే వైసీపీకి అసలైన పోటీదారు అన్నట్లుగా కలరింగు ఇచ్చిన ఆ మీడియా వర్గం ఇపుడు కళ్ళు తెరచి వాస్తవాలను చూస్తోందిట.
నాడు భోగమే….
నిజానికి చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్ననాటి ఉంచి, నిన్నటి వరకూ ఏపీని ఏలిన నేతగా ఉండేంతవరకూ కూడా భారీ ఎత్తున లాభాలు సదరు మీడియా సంస్థలకు దక్కాయి. అందుకే వారు చంద్రబాబుని పల్లకిలో పెట్టి మోసారు. బాబు నంది అంటే నంది, పంది అంటే పంది అనేశారు. అయితే రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు కదా. చంద్రబాబు ఓడిపోయారు. ఓ వైపు చూస్తే మళ్లీ టీడీపీ పుంజుకుంటుందన్న సంకేతాలు లేవు. ఇంకో వైపు చూస్తే జగన్ మధ్యాహ్న మార్తాండుడులా వెలిగిపోతున్నారు. దీంతో మాకు ఈ కయ్యాలు అవసరమా అన్న ఆలోచనలో ఆ మీడియా వర్గాలు పడినట్లుగా చెబుతున్నారు.
జగన్ కి మెచ్చుకోలు…
నిత్యం తన రాతలతో జగన్ ని నానా తిట్లు తిట్టే ఒక మెయిన్ స్ట్రీం మీడియా మోతుబరి ఒకరు ఈ మధ్యన తన రాతల్లో మార్పు చూపిస్తున్నారు. ఆయన కలం పోటు జోరు తగ్గిందట. జగన్ని మెచ్చుకుంటున్నాడు. జగన్ ది దూర దృష్టి అంటున్నాడు. జగన్ చేసినట్లుగా చంద్రబాబు ఏపీలో కులాల సోషల్ ఇంజనీరింగ్ చేయలేకపోయారని కూడా పోలిక పెట్టి మరి బాబుని ఎండగడుతున్నాడు. జగన్ విజన్ వేరు. అది రాజకీయం అయినా కూడా పక్కాగా చేసుకునిపోతున్నాడు. అది అంతిమంగా అతనికి ఉపయోగపడుతోంది అని కూడా రాసుకొచ్చాడు. ఇక జగన్ తెలివైన రాజకీయ నేత అన్ కూడా కితాబు ఇస్తున్నాడు. జగన్ మొండితనమే అతనికి ఆభరణమని, నాయకుడు అన్న వాడు తాను నమ్మినదానికి కట్టుబడి ఉండాలని కూడా సూచిస్తున్నాడు.
కాడె వదిలేశారా..?
ఇక ఇలాంటి రాతలు బట్టి చూసినా, మరో వైపు బలమైన సామాజికవర్గం చంద్రబాబు మీద గుస్సా అవుతున్న విధానం చూసినా కూడా 2024 ఫలితాలను వారు ముందే ఊహిస్తున్నారా అనిపించకమానదు. చంద్రబాబుతో ఉంటే మునిగిపోతామన్న భయం, బెంగా వీరిలో ఎక్కడో పట్టుకున్నట్లుగా ఉంది. నిజానికి జగన్ ఓ వర్గానికి చెందిన వారికి కూసాలు కదిలిపోయేలా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అవే ఇపుడు కొనసాగిస్తున్నాడు. ఇపుడు కరోనా మహమ్మారి తో, లాక్ డౌన్ తో ఈ వర్గమే పూర్తిగా నష్టపోయింది. ఇవన్నీ కూడా వారు ఊహించనివే. దాంతో ఏపీ రాజకీయాల్లో బధ్ధ శత్రువుల్లా ఒక రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య సామరస్యం కోసం తెర వెనక కసరత్తు సాగుతోంది అంటున్నారు. అంటే ఓ విధంగా రాజీ అన్న మాట. అదే కనుక కుదిరితే ఏపీలో జగన్ మీద ఈగ అయినా వాలదు, అదే సమయంలో టీడీపీకి పెద్ద గొంతు మద్దతు లేకుండా మూగబోతుందేమో. మొత్తానికి ఈ పరిణామాలు పసుపు పార్టీ పుట్టెని ముంచేలా ఉన్నాయని అంటున్నారు.