అందుకేనా బాబు మౌనం…?
చంద్రబాబు ప్రజాస్వామ్య రక్షకుడుగా డెమొక్రసీ సేవియర్ గా ఎన్నికల ముందు కొత్త అవతారం ఎత్తారు. ఆయన తరచూ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రజాస్వామ్యం డేంజర్ లో పడుతోందని [more]
చంద్రబాబు ప్రజాస్వామ్య రక్షకుడుగా డెమొక్రసీ సేవియర్ గా ఎన్నికల ముందు కొత్త అవతారం ఎత్తారు. ఆయన తరచూ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రజాస్వామ్యం డేంజర్ లో పడుతోందని [more]
చంద్రబాబు ప్రజాస్వామ్య రక్షకుడుగా డెమొక్రసీ సేవియర్ గా ఎన్నికల ముందు కొత్త అవతారం ఎత్తారు. ఆయన తరచూ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రజాస్వామ్యం డేంజర్ లో పడుతోందని లెక్చర్లు దంచేవారు. మోడీ పాలనలో దేశానికి ఇబ్బందులు వచ్చాయని, అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారని ఎలుగెత్తి అరిచేవారు. మోడీని దించకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ఉండదని కూడా గట్టిగా చెప్పేవారు. తమకు ప్రధాని పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యమే ముఖ్యమని కూడా నొక్కి వక్కాణించేవారు. అటువంటి చంద్రబాబు ఇపుడు ఎక్కడా కిక్కురుమనడంలేదు. దేశానికి రెండవ అతి పెద్ద పదవి అయిన హోం శాఖను నిర్వహించిన ఘనాపాటి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చిదంబరం అరెస్ట్ అయితే బాబు నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. కనీసం ఇది తప్పు అని కానీ ఇది కరెక్ట్ అని కానీ ఆయన స్పందించలేదు.
చీకటి దోస్త్ మీద ప్రేమ ఇదేనా?
ఇదే చిదంబరంతో చీకట్లో కలిశానని ఆనాడు ఈనాడూ కూడా చంద్రబాబు చెప్పలేదు కానీ స్వయంగా చిదంబరమే అప్పట్లో పార్లమెంట్ లో చంద్రబాబు గుట్టు బయటపెట్టి టీడీపీ తమ్ముళ్ళ నోరు మూయించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. హోం మంత్రిగా చిదంబరం ఉన్న రోజుల్లో బాగానే కలిసేవారు. అలా కలిసే జగన్ ని సీబీఐ కేసుల్లో ఇరికించారని అంటారు. మరిపుడు తన దోస్త్ చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేస్తే ఈ డెమోక్రసీ సేవియర్ చంద్రబాబు నోరు విప్పడంలేదు. మరో వైపు మమతా బెనర్జీ, డీఎంకే స్టాలిన్, సీపీఎం నుంచి ఏచూరి వంటి వారు అరెస్ట్ చేసిన విధానం తప్పు అని ఖండించారు. కానీ చంద్రబాబు మాత్రం మౌన ముని అవతారం ఎత్తేసి గమ్మునున్నారు. మరి చంద్రబాబు ఎందుకు ఇలా అయిపోయారో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇదే కాదు, నెల రోజుల క్రితం కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కూలిపోయింది. అప్పట్లో కుమార కిరీట ధారణకు వెళ్ళిన చంద్రబాబు ఆయన్ని కూలదోస్తే మాత్రం కనీసం స్పందించలేకపోయారు. మరి అపుడు కూడా మాయావతి, మమతా బెనర్జీ వంటి వారు గట్టిగానే మోడీ మీద మాట్లాడారు. చంద్రబాబు చంద్రబాబు మాత్రం డెమోక్రసీ సేవియర్ అవతారం చాలించారా అన్న అనుమానాలు నాడే వచ్చాయి.
ఎందుకిలా బాబూ….
ఇక మరో స్నేహితుడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లాను తన ఇంట్లోనే బంధించి మరీ కాశ్మీర్ ని ముక్కచెక్కలుగా విడగొడితే చంద్రబాబు మాత్రం తాపీగా తన ఎంపీల చేత ఆ బిల్లుకు మద్దతు ఇప్పించేశారు. మిత్రుడు ఫరూఖ్ ఏడుపులు. పెడ బొబ్బలు సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. ఇవన్నీ చూసిన తరువాత మూడు నెలల క్రితం చంద్రబాబు చెప్పింది నిజమా ఇపుడు బాబు వ్యవహరిస్తున్నది నిజమా అని ప్రతిపక్ష నేతలే తేల్చుకోలేకపోతున్నారుట.
మౌనానికి అదే కారణమా..?
చంద్రబాబు మరీ ఇంతలా మౌనం వహించడానికి రెండవసారి కూడా బంపర్ మెజారిటీతో మోడీ ప్రధాని కావడంతో ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో ఏకపక్షంగా పెరిగిన బలం, అమిత్ షా దూకుడు కారణమని అంటున్నారు. పైగా ఏపీలో ఎటూ అధికారం పోయింది. పాత కేసులేమైనా తిరగతోడితే చిదంబరం గతే తనకూ పడుతుందన్న ముందు చూపుతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలే అంటున్నారు. అయినా ఇపుడున్న వ్యవస్థలు వదలవు బాబూ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. 18 కేసుల్లో తెచ్చుకున్న స్టేలు బద్దలై ఏదో రోజు చిదంబరం మాదిరిగానే జైలు కి వెళ్ళక తప్పదని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మరి బాబులోనూ అదే భయం ఉందా. అందుకేనా ఆర్జంట్ గా ఆయన డెమోక్రసీ సేవియర్ అవతారం చాలించేశారా…అవునేమో.