సారీ అంటున్న బాబు..ఎందుకంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ పార్టీపై దృష్టి పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, బీజేపీ కొన్ని ప్రాంతాలకే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ పార్టీపై దృష్టి పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, బీజేపీ కొన్ని ప్రాంతాలకే [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ పార్టీపై దృష్టి పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, బీజేపీ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో తిరిగి టీడీపీ పుంజుకునే అవకాశాలున్నాయని చంద్రబాబు భావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసింది. జనసేన సయితం పెద్దగా ప్రభావం చూపలేదు. అందువల్లనే తెలంగాణలో మళ్లీ నిలదొక్కుకునే అవకాశాలున్నాయన్నది చంద్రబాబు అంచనా.
దాదాపు ఒకే సమయంలో…..
అందుకోసం వీకెండ్స్ లో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. పార్టీ బలోపేతానికి అవసరైమన వ్యూహాలను వారికి అందిస్తున్నారు. అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు దృష్టంతా ఏపీపైనే ఉండనుంది. అక్కడ పార్టీని నిలబెట్టాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస స్థానాలయినా గెలిపించుకోవాల్సి ఉంది.
నిధులు లేవని….
దీంతో చంద్రబాబు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగానే మేనేజ్ చేసుకోవాలని సూచించారట. ఆర్థికంగా కూడా ఆదుకోలేనని చెప్పారట. నిజానికి ఏపీలో ఎన్నికలకు ముందే టీడీపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో ఢీ అనడంతో రావాల్సిన నిధులు కూడా ఎన్నికల సమయానికి అందకపోవడంతో అభ్యర్థులకు కూడా ఏపీలో పార్టీ నిధులను అందించ లేకపోయారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు తెలంగాణ పార్టీకి నిధులు అందించడం కష్టమని చంద్రబాబు తేల్చి చెప్పారట.
ప్రచారానికి కూడా….
బలమున్న చోట మాత్రమే పోటీ చేసి, ఆర్థికంగా బలంగా ఉన్న వారిని బరిలోకి దింపాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది. పార్టీ నుంచి ఏమీ ఆశించవద్దని కూడా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణకు చంద్రబాబు చెప్పడంతో తెలంగాణలో పార్టీ కిందా మీదా పడుతుంది. ఏపీలో రాజధాని అమరావతి ఉద్యమం కోసం నిధులు వెచ్చించాల్సి రావడం, ఏపీలోనూ స్థానికసంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో చంద్రబాబు తెలంగాణ పార్టీకి ఆర్థికంగానూ, ప్రచారపరంగానూ తానేమీ చేయలేనని చెప్పడంతో టీడీపీ తెలంగాణ నేతలు డీలా పడ్డారు.