ఆంధ్రులు బాగుపడిందెక్కడ?
అందుకే ఆంధ్రులు ఇలా అయిపోయారేమో. ఇతరులతో పంచుకోవడం విషయంలో ఉన్న సహనం సొంత అన్నదమ్ములతో మాత్రం ఉండదు. మద్రాసీలుగా దశాబ్దాల పాటు మనగలిగిన ఆంధ్రులు అక్కడ రాజధాని [more]
అందుకే ఆంధ్రులు ఇలా అయిపోయారేమో. ఇతరులతో పంచుకోవడం విషయంలో ఉన్న సహనం సొంత అన్నదమ్ములతో మాత్రం ఉండదు. మద్రాసీలుగా దశాబ్దాల పాటు మనగలిగిన ఆంధ్రులు అక్కడ రాజధాని [more]
అందుకే ఆంధ్రులు ఇలా అయిపోయారేమో. ఇతరులతో పంచుకోవడం విషయంలో ఉన్న సహనం సొంత అన్నదమ్ములతో మాత్రం ఉండదు. మద్రాసీలుగా దశాబ్దాల పాటు మనగలిగిన ఆంధ్రులు అక్కడ రాజధాని పోగొట్టుకుని మొత్తం గుండు సున్నా చేసుకుని పదకొండు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా వచ్చిపడ్డారు. అప్పట్లో ఉన్న ఏపీ భౌగోళిక చిత్రపటం చూస్తే అటు బళ్ళారీ దాకా, ఇటు ఒడిషా బరంపురం దాకా ఆంధ్ర రాష్ట్రమే ఉండేది. అలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటూ ఆశపడి చేసిన ప్రయోగం వల్ల శ్రీకాకుళం వరకూ మాత్రమే ఇవతల దక్కింది. అటు బళ్ళారిని కర్నాటకకు కోల్పోయి తుంగభద్ర నదిలో వాటాను కూడా లేకుండా చేసుకుని రాయలసీమ కరువు సీమగా మారింది. అరవయ్యేళ్ళ ఉమ్మడి ఏపీలో ఆంధ్రులు ఏ మాత్రం బాగుపడలేకపోయారు. విభజన ఏపీలో కూడా మళ్ళీ అదే తంతు, కులాల కంపుతో ముక్కచెక్కలు చేసుకుంటున్నారు.
ఉప ప్రాంతీయ ఉద్యమాలా…?
ఇప్పటిదాకా ప్రత్యేక రాయలసీమ కావాలన్న డిమాండ్ నే వింటున్నాం. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశం కలిపి ఇస్తే ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమగా కొత్త రాష్ట్రం పెట్టుకుంటామని, కడపను రాజధాని చేసుకుంటామని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, మైసూరారెడ్డి లాంటివారు అపుడే గర్జిస్తున్నారు. ఇక పరిటాల కుటుంబం సైతం అమరావతి రాజధాని మార్చితే ప్రత్యేక రాయలసీమ ఇవ్వాల్సిందేనని గట్టిగానే కోరుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే మరో వైపు ఉత్తరాంధ్రాను కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం ఉసిగొలుపుతున్నారు.
ఉత్కల్ కళింగట…..
ఉత్తరాంధ్రా అంతటా ఉద్యమాలు చేసైనా రాజధాని సాధిస్తామని తమ్మినేని అంటున్నారు. లేకపోతే నాడు ఆంధ్రరాష్ట్రంలో భాగంగా ఉండి ఇపుడు ఒడిషాలో చేరిపోయిన బరంపురం వరకూ ఉన్న తెలుగు ప్రాంతాలతో కలుపుకుని కొత్త రాష్ట్రం కోరుతామన్న సౌండ్ కూడా ఆయన మాటల్లోనే ఉంది. ఇలా చూసుకుంటే మిగిలింది మధ్యాంధ్ర. అంటే గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకూ అన్న మాట. మరి ఇక్కడ కూడా కొత్త నినాదం అందుకుంటోంది.
కొత్తగా కోస్తా….
కోస్తాంధ్రా పేరిట తమకో రాష్ట్రం ఇచ్చేస్తే అమరావతిని రాజధానిగా చేసుకుని అలా ముందుకు పోతామని బలమైనా కమ్మ సామాజికవర్గంలోని కొందరు డిమాండ్ చేయడం తాజా విడ్డూరం. ఇలా వస్తున్న డిమాండ్లు ఎన్ఆర్ఐలుగా ఉన్న కమ్మ వారి నుంచే కావడం విశేషం. అమరావతి రాజధానితోనే తమ జీవనం ముడిపడిఉందని, కోట్లకు కోట్లు ప్రాజెక్టుల రూపంలో అక్కడ పెట్టుబడులు పెట్టామని, ఇపుడు రాజధాని కాదంటే తమ సంగతేంటని వారు గద్దిస్తున్నారు. మరి ఇలా చూసుకునే మిగిలినవి గోదావరి జిల్లాలే. వారి రెండు జిల్లాలనూ ఒక రాష్ట్రం చేసేస్తే మొత్తం పదమూడు జిల్లా ఏపీ అయిదు రాష్ట్రాలు అవుతాయి. ఎవరికి నచ్చినట్లుగా వారు రాజధానులు పెట్టుకోవచ్చేమో. మొత్తానికి పాలనా వికేంద్రీకరణ కొత్త పుంతలు తొక్కుతూ కొత్త సమస్యలు తెచ్చేలా ఉందని అంటున్నారు.