నవ్వుకుంటున్నారు బాబు
వరద రాజకీయం మాట ఎలా ఉన్నా… అందులో కొందరు నేతలు లేవనెత్తున్న ప్రశ్నలే నవ్వులు తెప్పిస్తున్నాయి. నవ్వి పోదురు నాకేమిటి అన్నట్లుగా నేతలు రీజన్ లేకుండా మాట్లాడేస్తున్నారు. [more]
వరద రాజకీయం మాట ఎలా ఉన్నా… అందులో కొందరు నేతలు లేవనెత్తున్న ప్రశ్నలే నవ్వులు తెప్పిస్తున్నాయి. నవ్వి పోదురు నాకేమిటి అన్నట్లుగా నేతలు రీజన్ లేకుండా మాట్లాడేస్తున్నారు. [more]
వరద రాజకీయం మాట ఎలా ఉన్నా… అందులో కొందరు నేతలు లేవనెత్తున్న ప్రశ్నలే నవ్వులు తెప్పిస్తున్నాయి. నవ్వి పోదురు నాకేమిటి అన్నట్లుగా నేతలు రీజన్ లేకుండా మాట్లాడేస్తున్నారు. కృష్ణా నదికి వరద వచ్చి వందలాది ఇళ్లు మునిగిపోయాయి. పంటపొలాల్లోకి నీరు చేరింది. అయితే చంద్రబాబు ఇల్లు ఒక్కటే ఇప్పుడు చర్చ అయి కూర్చుంది. కరకట్ట మీద స్థిర నివాసం ఏర్పరచుకున్న చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వచ్చింది. నీరు పల్లమెరుగు… అన్న రీతిలోనే వరద నీరు చంద్రబాబు ఇంటి గడపను తాకింది.
గేట్లు ఎత్తడంతోనే….
దీంతో వైసీపీ నేతలు ఇంకేముంది చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందంటూ రాద్ధాంతం చేశారు. నేను చెప్పలా… చెప్పలా.. అంటూ ఎద్దేవా చేశారు. శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ నుంచి వస్తున్న అవుట్ ఫ్లో పెరగడంతో పులిచింతల గేట్లును కూడా ఎత్తేశారు. దీంతో నిన్న సాయంత్రం ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు బయటకు పులిచింతల ప్రాజెక్టు నుంచి వదిలారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కావాలని గేట్లు ఎత్తడంలో జాప్యం చేసినందునే చంద్రబాబు ఇంటికి నీరు వచ్చి చేరిందని వాదిస్తున్నారు. నిల్వ సామర్థ్యానికి మించుతుందని భావిస్తేనే గేట్లు ఎత్తుతారు. ప్రతి ప్రాజెక్టుకు కొన్ని లెక్కలుంటాయి.
నాటు పడవలను అడ్డం పెట్టి….
నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యాన్ని బట్టే వదిలారు. ఇంతకీ చంద్రబాబు ఇంటిలోకి వరద నీరు రావడానికి మరో కారణం కూడా చెబుతున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు ఇంటికి వరదను డైవెర్ట్ చేయడానికి నాటుపడవలను వైసీపీ నేతలు వినియోగించారని ది గ్రేట్ లీడర్ వర్ల రామయ్య చెబుతున్నారు. నాటుపడవలను అడ్డం పెట్టి వరదను మళ్లించవచ్చని వర్ల రామయ్య చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి.
రెండు పార్టీల నేతల కామెంట్స్….
ఒకవైపు వరద వచ్చి ప్రజలు అవస్థలు పడుతుంటే చంద్రబాబుఇంటిపైనే వైసీపీ నేతలు దృష్టి పెట్టడం కూడా సరికాదు. వారిలో చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించాలన్న లక్ష్యమే ఎక్కువగా కన్పిస్తున్నట్లుంది. ఇక టీడీపీ కూడా డ్రోన్లు, వరదను తమకు అనుకూలంగా మలచుకునేందుకు అసలు వరద బాధితులను వదిలేశారు. తమ అధినేతపై హత్యకు కుట్రపన్నారంటూ రాగాలు అందుకుంటున్నారు. మొత్తం మీద ఇద్దరినీ చూసి జనం నవ్వుకుంటున్నారు.