ఆయనే షాడో ముఖ్యమంత్రి… వైసీపీలో బిగ్ డిబేట్
ఆయన సీఎం తర్వాత సీఎం అంట. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఉంటే.. సీఎం తర్వాత సీఎంగా చక్రం తిప్పుతున్నారట. ఒకవేళ ఏదైనా పనిమీద సీఎం జగన్ ఢిల్లీ [more]
ఆయన సీఎం తర్వాత సీఎం అంట. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఉంటే.. సీఎం తర్వాత సీఎంగా చక్రం తిప్పుతున్నారట. ఒకవేళ ఏదైనా పనిమీద సీఎం జగన్ ఢిల్లీ [more]
ఆయన సీఎం తర్వాత సీఎం అంట. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో ఉంటే.. సీఎం తర్వాత సీఎంగా చక్రం తిప్పుతున్నారట. ఒకవేళ ఏదైనా పనిమీద సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే.. ఏకంగా సీఎంగా నే చలామణి అవుతున్నాడట ఇదీ ఇప్పుడు తాడేపల్లిలో వినిపిస్తున్న టాక్. సీఎం జగన్కు దూరపు బంధువు.. ఆయన వ్యాపారాల్లోనూ ఒకింత భాగస్వామిగా ఉన్న ఈయన గతంలో జగన్ మీడియాలో చక్రం తిప్పారట. అయితే, ఇప్పుడు మాత్రం ప్రభుత్వంలో కీలక పోస్టులో ఉన్నారు. అంటే.. ప్రజాప్రతినిధిగా కాదు… కాకపోయినా.. ప్రజా ప్రతినిధులనే మేనేజ్ చేయగలిగే పోస్టులో ఉన్నారట.
చాలా డిఫరెంట్ గా….
మంచిదే! మనోడు అనుకుంటే.. ఎవరైనా సంతోషిస్తారు. కానీ, ఈయన మాత్రం డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మంత్రులకు.. జగన్కు మధ్య చక్రం తిప్పుతూ.. సర్వం తానే అయి వ్యవహరిస్తున్నారట. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్వతహాగా కాంట్రాక్టు పనులు చేపడుతారు. అంటే.. ఆయా పనుల నుంచే వారు రాజకీయాల్లోకి వచ్చారు వైసీపీ తరఫున గెలుపు గుర్రాలు ఎక్కారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న పనులను తమకు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, మంత్రులు మద్యలో వేలు పెట్టి వాటిని టీడీపీకి గతంలో పనిచేసిన.. కాంట్రాక్టర్లకు అమ్మేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఈయన ఓకే అంటేనే…..
దీంతో కృష్ణా, చిత్తూరు, విశాఖ సహా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. పైకి ఏమీ అనలేక.. లోలోన మదన పడలేక.. అందివచ్చిన అవకాశం చేజారిపోతుండడంతో మంత్రులపై చిర్రుబుర్రులాడుతున్నారు. ఇక, వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు.. నేరుగా ఈ విషయాన్ని సీఎం జగన్కు వివరించి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరేందుకుప్రయత్నించారు. దీంతో అప్పుడు తెలిసింది వీరికి మధ్యలో మరో సీఎం కాని సీఎం ఉన్నారని. విషయం ఏదైనా.. ముందు ఆయనకు చెప్పాలి. అంటే.. గుళ్లో భక్తుడికి.. భగవంతుడికి మధ్య పూజారి ఉన్నట్టు. సదరు నాయకుడు ఓకే అంటే.. సీఎం వద్దకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అవుతుంది.
ఏదైనా పని కావాలన్నా……
లేకపోతే.. సదరు విషయం అసలు సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లే పరిస్థితి లేదు. మరి మధ్యలో ఉన్న నాయకుడు. మంత్రులకు ఎక్కువగా జై కొడుతున్నారట. ఎమ్మెల్యేలంతా ఇంతే అంటూ నిష్టూరంగా మాట్లాడి మంత్రులకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారట. మంత్రులు కూడా తమకు ఏదైనా కావాలంటే.. ఈయనకు చెబితే..సరిపోతుందని పర్సనల్ పనులు ఏవైనా ఉంటే.. ఈయనకే చెప్పుకొని చేయించుకుంటున్నారట. మొత్తానికి ఈ షాడో సీఎం విషయంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారనేది వాస్తవమని అంటున్నారు వైసీపీ నాయకులు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.