ఇప్పుడు కదా అసలు సంగతి తేలేది?
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగి పదహారేళ్లవుతుంది. 2005 లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. [more]
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగి పదహారేళ్లవుతుంది. 2005 లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. [more]
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగి పదహారేళ్లవుతుంది. 2005 లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. 2010లో గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గం సమయం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గుంటూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు.
ఎవరిది విజయం?
ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడంతో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికగా మారింది. గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 డివిజన్ లు ఉన్నాయి. మార్చి 15వ తేదీన ఎన్నికలు వాయిదా పడే సమయానికి 57 డివిజన్లకు సంబంధించి 560 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అప్పట్లో విడివిడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు స్క్రూటినీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండటంతో కొత్తగా నామినేషన్ వేసేందుకు అవకాశాలు లేవు.
వైసీపీ ఎమ్మెల్యేలున్నా….
అయితే గుంటూరు కార్పొరేషన్ కు ఒక ప్రత్యేకత ఉంది. 1994లో గుంటూరు కార్పొరేషన్ ఏర్పడింది. ఎక్కువ సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు పట్టు ఉండటమే కారణంగా చెప్పాలి. అయితే ఈసారి రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు రాజధాని అమరావతి పరిధిలో ఉంది. రాజధాని తరలింపు ప్రభావం ఈ ఎన్నికలపై పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. గుంటూరులో తూర్పు, పశ్చిమ ఇద్దరు ఎమ్మెల్యేలుండగా తూర్పు నుంచి ముస్తాఫా విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి టీడీపీ నుంచి గెలిచినా వైసీపీ మద్దతుదారుగా మారిపోయారు.
రాజధాని ఎఫెక్ట్…..?
దీంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ విజయావకాశాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. రాజధాని తరలింపుతో గుంటూరు పరిధిలోని స్థలాల రేట్లు, ఇంటి అద్దెలు కూడా పడిపోవడం అధికార పార్టీపై పడుతుందంటున్నారు. ఇక టీడీపీ కూడా గుంటూరు ప్రాంతంలో బలంగా ఉంది. సీనియర్ నేతలంతా ఇక్కడే ఉన్నారు. ఇక బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా గుంటూరు వాసి కావడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపే అవకాశముంది. జనసేన మద్దతు తోడైతే కొన్ని వార్డులు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో ఈసారి గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 30 వార్డులు గెలచుకుంటే మేయర్ పదవి దక్కుతుంది. ఆ దిశగా రెండు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.