మా సీటు…. మాదేనని
వైసీపీకి కొత్తగా మూడు ఎమ్మెల్సీ సీట్లు దక్కబోతున్నాయి. అందులో ఒకటి ఉత్తరాంధ్ర నుంచి ఖాళీ అవబోతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ టికెట్ ఇచ్చారు. [more]
వైసీపీకి కొత్తగా మూడు ఎమ్మెల్సీ సీట్లు దక్కబోతున్నాయి. అందులో ఒకటి ఉత్తరాంధ్ర నుంచి ఖాళీ అవబోతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ టికెట్ ఇచ్చారు. [more]
వైసీపీకి కొత్తగా మూడు ఎమ్మెల్సీ సీట్లు దక్కబోతున్నాయి. అందులో ఒకటి ఉత్తరాంధ్ర నుంచి ఖాళీ అవబోతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ టికెట్ ఇచ్చారు. అప్పట్లో పార్టీ ప్రతిపక్షంలో ఉంటే వచ్చిన రెండు సీట్లో ఒకదాన్ని ఆయనకు ఇచ్చి ఉత్తరాంధ్ర పట్ల, ఓసీల పట్ల తన విశ్వాసాన్ని చాటుకున్నారు. ఇపుడు కోలగట్ల పదవికి రాజీనామా చేసి విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పదవీ కాలం 2021 మార్చి 29తో పూర్తి కాబోతోంది. కోలగట్ల ఖాళీ చేసిన కుర్చీలో కూర్చోవాలని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు చాలా మంది ఎదురుచూస్తున్నారు. వారిలో సీనియర్ నేతలు, కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు కూడా ఉన్నారు. మరి న్యాయం ప్రకారం తమ ప్రాంతం సీటు తమకే ఇవ్వాలన్నది ఇక్కడి వైసీపీ నేతల వాదనగా ఉంది.
జగన్ మీద భారం వేసి….
వైసీపీలో చివరి నిముషంలో చేరిన శ్రీకాకుళం బీసీ నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఎమ్మెల్సీ కావాలని చూస్తున్నారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమెను రాజకీయాల్లో మంచి స్థానంలో నిలిపిన వారు వైఎస్సార్. 2004లో ఆమెకు మొదటి సారి టికెట్ ఇచ్చిన వైఎస్సార్ అపుడు గెలవకపోతే పట్టుబట్టి మరీ 2009 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి దగ్గరుండి గెలిపించారు. ఆమె జగన్ పార్టీలో ఎన్నికలకు ముందు చేరారు. తగిన న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని కృపారాణి వర్గం అంటోంది. ఇక విజయనగరం జిల్లాలో కురు వ్రుధ్ధుడైన నాయకుడు సాంబశివరాజు ఉన్నారు. ఆయన్ని, ఆయన కుమారుడిని పక్కన పెట్టారన్న ఆవేదన పార్టీలో ఉంది. తన కుమారుడుకి ఎమ్మెల్సీ ఇస్తే ఓసీ కోటాకు, అదే విజయనగరం సీటుకు న్యాయం జరుగుతుందని పెద్దాయన భావిస్తున్నారుట. విశాఖలో చూసుకుంటే బీసీ వర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలు అయిన వైసీపీ సీనియర్ నేత కోలా గురువులు ఉన్నారు. ఆయన సైతం ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
టీడీపీ కోటా ఒకే ….
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఆశిస్తున్న ఈ నాయకులంతా టీడీపీని గుర్తు చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్సీగా ఎంవీవీఎస్ మూర్తికి అవకాశం ఇచ్చిందని, అలాగే ఎన్నికలకు ముందు రజక కులానికి చెందిన రామారావుకు, గవర సామాజిక వర్గానికి చెందిన బుద్దా నాగ జగదీశ్వరరావుకు ఇచ్చారని పేర్కొంటున్నారు. ఇక కాపుల కోటాలో పప్పల చలపతిరావుకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారని చెబుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ఉత్తరాంధ్రకు టీడీపీ న్యాయం చేసిందని, వైసీపీ కూడా అదే విధంగా చేయాలని కోరుతున్నారు. మరి ఉన్నవి మూడు సీట్లు, జగన్ హామీలు ఇచ్చిన వారు అనేకమంది ఉన్నారు. వారిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ వంటి వారికి సీటు రిజర్వ్ అయిపోయింది. మైనారిటీకి ఒకటి అనుకుంటే మిగిలింది ఒకే ఒక సీటు.. మరి అది ఉత్తరాంధ్రాకు ఇస్తారా, కోస్తాకు ఇస్తారా అన్నది చూడాలి.