బీజేపీ దయతోనే సీఎం పోస్ట్ ?
రాజకీయాల్లో యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అది ప్రకృతిలోనూ ఉంటుంది. ఏది నమ్మినా నమ్మకపోయినా దీన్ని నమ్మాల్సిందే. తెలంగాణా రాజకీయాలు సజావుగా సాగుతున్న వేళ కమలం కదన [more]
రాజకీయాల్లో యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అది ప్రకృతిలోనూ ఉంటుంది. ఏది నమ్మినా నమ్మకపోయినా దీన్ని నమ్మాల్సిందే. తెలంగాణా రాజకీయాలు సజావుగా సాగుతున్న వేళ కమలం కదన [more]
రాజకీయాల్లో యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అది ప్రకృతిలోనూ ఉంటుంది. ఏది నమ్మినా నమ్మకపోయినా దీన్ని నమ్మాల్సిందే. తెలంగాణా రాజకీయాలు సజావుగా సాగుతున్న వేళ కమలం కదన రంగాన నిలిచి మొత్తానికి టీఆర్ఎస్ ఊహాలోకాన్ని పటాపంచలు చేసి పారేసింది. మరో దశాబ్దం వరకూ తమకు ఎదురులేదనుకున్న సీన్ ని ఒకే ఒక్క దుబ్బాక ఉప ఎన్నికతో పూర్తిగా మార్చేసింది. ఆ ఊపులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో యాభైకి దరిదాపు కార్పోరేటర్ల సీట్లు కూడా కొల్లగొట్టింది. దాంతో టీఆర్ఎస్ అధినాయకత్వం మత్తు పూర్తిగా దిగిపోయింది. ఒక్కసారిగా వాస్తవ లోకానికి వచ్చి పడింది.
అదే రీజన్ …..
అర్జంటుగా కేటీయార్ సీఎం కావడానికి ఎవరు కారణం అంటే తెర వెనక కేసీయార్ అని అంతా చెబుతారు. కానీ అది కాదు, కమలనాధులే అసలైన కారణమని అంటున్నారు విశ్లేషకులు. కేటీయార్ సీఎం కుర్చీలో కూర్చోగానే రుణపడాల్సింది, దండాలు పెట్టాల్సింది బీజేపీ వారికేనని కూడా అంటున్నారు. బీజేపీ దుబ్బాక సీటు గెలవకపోయినా గ్రేటర్ లో భారీ ఊపు కనబరచకపోయినా కేసీయారే ఇంకా సీఎం గా ఉండేవారు. 2023 ఎన్నికల తరువాత మళ్లీ టీఆర్ఎస్ గెలిస్తే అపుడేమైనా కేటీయార్ కి చాన్స్ ఉండేదేమో. కానీ కమలం పార్టీ తిప్పి వేసిన కళావర్ కార్డు తో కలవరపడిపోయింది టీఆర్ఎస్. దాంతోనే కుమారుడు అతి త్వరలోనే కేటీయార్ కి పట్టాభిషేకం చేస్తోంది అంటున్నారు.
లెక్క కరెక్ట్ ….
కేసీయార్ మంచి వ్యూహకర్త. ఆయన లెక్కలు కూడా ఎపుడూ తారు మారు అయిన దాఖలాలు లేవు. తెలంగాణా వస్తుందని రెండు ఎంపీ సీట్లున్నపుడు ఎలా ఊహించారో ఇపుడు తెలంగాణాలో అసలు రాజకీయంగా గులాబీ పార్టీకి బాగులేదని కేసీయార్ ఊహించారు. ఆయన అన్నం మెతుకే పట్టుకున్నారు అందుకే 2023 మీద ఆసలు వదులుకున్నారు. ఇపుడు చేతిలో అధికారం ఉంది. కష్టపడి తెచ్చుకున్న పవర్ లో కొన్నాళ్ళు కొడుకుకి భాగం ఇస్తే పోయేదేమీ లేదు. పైగా ఫ్యూచర్ లీడర్ గా మరింత బిగ్గర్ స్కేల్ లో ప్రత్యర్ధుల ముందు కనిపిస్తాడు. సీఎం హోదాలో రేపటి రోజున కేటీయార్ ఎదురు నిలిచినపుడు ఆ ఎన్నికల్లో వచ్చే ఇమేజ్ కూడా వేరుగా ఉంటుంది. పైగా యువ రక్తం, పార్టీకి కూడా కొత్త జవసత్వాలు వస్తాయి. అందుకే కేసీయార్ కచ్చితమైన వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు అంటున్నారు.
బీజేపీకి గట్టి జవాబేనా…
కేసీయార్ ని విమర్శించినట్లుగా రేపటి రోజున కేటీయార్ సీఎం అయ్యాక విమర్శిస్తే కుదరదు. ఎందుకంటే ఆయన ఫాం హౌస్ సీఎం కాడు, జనంలోనే ఉంటాడు, పైగా డైనమిక్ లీడర్ గా ఉంటాడు. యువకుడు కాబట్టి దూకుడు పాలిటిక్స్ చేస్తాడు. జనంలో కూడా కేసీయార్ ముఖం చూసి రోసిన వారికి కేటీయార్ రావడంతోనే ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. ఎన్నికలు జరగకపోయినా కూడా కొత్త సర్కార్ తెలంగాణాకు వచ్చినట్లు అవుతుంది. కేటీయార్ తనదైన శైలిలో పాలన సాగిస్తే కచ్చితంగా 2023లో అధికారంలోకి మళ్ళీ వచ్చినా రావచ్చు. లేకపోతే గట్టి పోటీ ఇచ్చి మరో చాన్స్ కోసం వేచి ఉన్నా తప్పు లేదు. ఎందుకంటే ఆయన సీఎం హోదాను అప్పటికే అనుభవించి ఉంటాడు కాబట్టి. ఇక క్యాడర్ కూడా పూర్తిగా కేటీయార్ కంట్రోల్ లోకి వస్తుంది. మొత్తానికి ఎన్నో అంచనాలు లెక్కలతోనే కేసీయార్ కుమారుడికి సింహాసనం అప్పగిస్తున్నారు. ఎన్ని ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల కంటే ముందే కేటీయార్ సీఎం అవుతున్నాడు అంటే అది కచ్చితంగా బీజేపీ దూకుడు వల్లనే అన్నది మాత్రం వాస్తవం.