జీతం తీసుకుని పోతే పోలా? ఎందుకింత రచ్చ?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పట్టుదలకు పోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వంతో యుద్ధానికే ఆయన రెడీ అయ్యారు. తాను [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పట్టుదలకు పోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వంతో యుద్ధానికే ఆయన రెడీ అయ్యారు. తాను [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పట్టుదలకు పోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వంతో యుద్ధానికే ఆయన రెడీ అయ్యారు. తాను పదవిలో ఉండగానే ఎన్నికలు జరపాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిత్యం వివాదాలతోనే గేమ్ ప్రారంభించారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతోనే ఆయనకు ఇబ్బందిగా మారిందని చెప్పడంలో సందేహం లేదు.
ప్రభుత్వంతో అమితుమీకే…..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది ప్రారంభంలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే కరోనా కేసులు నాలుగైదు ఉన్న తరుణంలో గత ఏడాది మార్చి 15న ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడంతో పాలకులు కూడా ఆయనపై ఎదురుదాడికి దిగారు. కులాన్ని ప్రస్తావించి మరీ ఆయనపై విమర్శలు చేశారు. నిమ్మగడ్డ కూడా ఏం తక్కువ తినలేదు. ఆయన ఏకంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసి సంచలనం సృష్టించారు.
పోయేదేముంది?
నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎన్నికలు జరిపినా, జరగకపోయినా పోయేదేం లేదు. 2018లోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా అప్పుడు ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్నకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఆన్సర్ లేదు. తాను మార్చి లో పదవి విరమణ చేస్తున్నందునే ఎన్నికలను హడావిడిగా పెడుతున్నారన్నది మాత్రం వాస్తవం. పైగా హైదరాబాద్ లో ఒక ప్రయివేటు హోటల్ బీజేపీ నేతలను కలవడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతత్వంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ప్రభుత్వ పెద్దలు తరచూ చెబుతూ వస్తున్నారు.
పంతంతోనేనా?
షెడ్యూల్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసినా ఎన్నికలను నిర్వహించాల్సింది ప్రభుత్వం మాత్రమే. అధికారుల నుంచి ఎన్జీవో సంఘాల వరకూ తాము ఎన్నికలను నిర్వహించలేమని చెబుతున్నారు. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంతంతో షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇది ఎవరికీ మంచిది కాదు. తనకు ప్రభుత్వంపై కక్ష ఉంటే వేరే రూపంలో తీర్చుకోవచ్చు. కోవిడ్ రెండో దశ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజలతో ఆటలాడుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే నిమ్మగడ్డకే అంత పంతం ఉంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలకులకు ఎంత పట్టుదల ఉండాలి? అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. మొత్తం మీద నిమ్మగడ్డ రచ్చ చేయడానికే రెడీ అయినట్లు కనపడుతుంది.